అబిడ్స్, మే 21: సామాజిక దృక్పథంతోనే సెయింట్ జార్జెస్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల యాజమాన్యం విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేస్తోందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.లింబాద్రి పేర్కొన్నారు. శనివారం సెయింట్ జార్జెస్ డిగ్రీ, పీజీ మహిళా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ సెయింట్ జార్జెస్ మహిళల కోసం జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోనే ఎడ్యుకేషన్ హబ్గా మారిందని తెలిపారు.
మెదక్ బిషప్, సెయింట్ జార్జెస్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏసీ సాల్మన్రాజ్, వజ్ర సాల్మన్రాజ్లు మాట్లాడుతూ తమ విద్యాసంస్థలలో నాణ్యమైన బోధనను అందించడమే కాకుండా సాంస్కృతిక, క్రీడారంగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. సెయింట్ జార్జెస్ ఇనిస్టిట్యూషన్స్ స్పెషల్ ఆఫీసర్ ఆర్.సత్యానందం, ప్రిన్సిపాల్ కరోలిన్లు మాట్లాడుతూ విద్యార్థులను ప్రతి రంగంలో తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేఏ చార్లెస్ వెస్లీ, డేవిడ్, మెదక్ డయాసిస్ వైస్చైర్మన్ డాక్టర్ భాస్కర్, డీసీసీ టౌన్ చైర్మన్ డాక్టర్ డి.ప్రసన్నకుమార్, కార్యదర్శి మోజస్పాల్,కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.