గోల్నాక, మే 21: నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం అంబర్పేట డివిజన్లోని పటేల్నగర్, న్యూపటేల్నగర్, నరేంద్రనగర్ తదితర ప్రాం తాల్లో స్థానిక కార్పొరేటర్ ఇ. విజయ్కుమార్తో పాటు పలు శాఖల అధికారులతో కలిసి ఆయన పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. లో-ప్రెషర్ మంచినీటి సమస్యతో పాటు ప్రమాదకరంగా మారిన హైటెన్షన్ వైర్లను తొలగించాలని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామని అన్నారు. రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైపులైన్ల ఏర్పా టు, పార్కుల సుందరీకరణ తదితర పనులను వేగవంతం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ముదిరాజ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు సలీం, జాకీబాబు, లవంగు నాగరాజు. అనిల్గౌడ్, గౌస్, సాయికుమార్ పాల్గొన్నారు.
అంజనశాలక ప్రతిష్ఠా ;మహోత్సవానికి రావాలని ఆహ్వానం
కాచిగూడ, మే 21: జూన్ 9 నుంచి 13 వరకు బర్కత్పురలోని జైన్మందిర్లో జరిగే అంజనశాలక ప్రతిష్ఠా మహోత్సవానికి రావాలని సంభవనాథ్ కుశాల్ ప్రార్థన జైన్మందిర్ ప్రతినిధులు శనివారం ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ను కలిసి ఆహ్వానించారు. ఈ మహోత్సవానికి దేశ వ్యాప్తంగా 50 మంది జైన్ సన్యాసులు, 300 మంది జైనులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జైన్మందిర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. సురేశ్, జూబక్, పూనమ్, దినేశ్, గోసర్, మహేందర్, రాజేశ్లోధా, సుమేశ్, యోగేశ్ పాల్గొన్నారు.