బేగంపేట్ మే 21: ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్పేట్ డివిజన్లో రూ. 6.31 కోట్లతో 16 అభివృద్ధి పనులను కార్పొరేటర్ చీర సుచిత్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉయదం పూట రద్దీ ఎక్కువగా ఉంటున్న కారణంగా రాత్రిపూట పనులు చేసేలా చూడాలన్నారు. నల్లగుట్టలో తక్కువ నీరు సరఫరా అవుతుందని స్థానికులు విన్నవించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జలమండలి జీఎం రమణారెడ్డిని ఆదేశించారు.
తమ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా చేస్తామని హామీ ఇచ్చారు. గైదిన్బాగ్లోని అంతర్గత రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పాన్బజార్లోని ప్రభుత్వ దవా ఖానకు ఎదురుగా కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రికల్ డీఈని ఆదేశించారు. కాచ్బౌలి హరిజన బస్తీలో నాలాపై వంతెన నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం స్థానికులతో మాట్లాడారు. బస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకోని కమ్యూనిటీ హాల్ను నిర్మించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అరుణగౌడ్, కిరణ్మయికిశోర్, డీసీ ముదకుందరెడ్డి, ఏఎంహెచ్వో ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.