వ్యవసాయ యూనివర్సిటీ, మే 21: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపర్చుకుని మంచి ఫలితాలు సాధించి దేశం మెచ్చేలా ఎదగాలని వి శ్రాంత ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ జాయిం ట్ డైరెక్టర్, ప్రధాన వక్త లక్ష్మీనారాయణ అన్నా రు. ప్రొ. కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల వార్షికోత్సవ సభకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థి దశలో సమయపాలన, క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతుకు అండగా ఉండే మంచి కోర్స్ ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం, తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు సానుకూలంగా ఉంది. ఈ ప్రాంతం పండ్ల తోటలు, కూ రగాయలు పెంచేందుకు అనుకూల నేలలు, వా తావరణం ఉంది. ఇప్పటికే తెలంగాణ అనతి కాలంలోనే సాగు రంగంలో అగ్ర భాగాన నిలిచిందన్నారు. పండ్ల తోటల విషయంలో చిన్న దేశం ఇజ్రాయిల్ను మనం అధిగమించే రోజు లు అతి దగ్గరలో ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాబోవు కాలంలో సేంద్రీయ పండ్ల తోటలు పెంచి నాణ్యత గల పండ్లు కూరగాయ లు మన ప్రాంతాలకు ఇవ్వడమే కాకుండా ఇత ర ప్రాంతాలకు, దేశాలకు ఎగుమతి చేసేందుకు మీ కృషి ఉండాలని సూచించారు. కార్యక్రమం లో విశ్వవిద్యాలయం వీసీ నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసా యం, అనుబంధ రంగాలకు ప్రధానంగా ఉద్యా న వన శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వాటిని సద్వినియోగ పర్చుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాశాల అసోసియేట్ డీన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పద్మ, కిరణ్ కుమార్, శ్రీనివాసన్, కళాశాల అధ్యాపకులు లక్ష్మీనారాయణ, రాజా గౌడ్, మల్లేష్, నవీన్ కుమార్, జ్యోతి, నాగహర్షిత, నిరోష, నవ్యశ్వేత, విద్య, భాగ్యశాలి హాజరై మాట్లాడారు.