సైదాబాద్, మే 21 : జలమండలి సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా చేపట్టిన పనులను అధికారులు సకాలంలో పూర్తి చేశారు. వేసవి కాలంలో కలిగే కలుషిత తాగునీటి సరఫరా, మురుగునీటి లీకేజీలు, చేతి పంపు మరమ్మతులు, పవర్ బోర్ల సింథటిక్ ట్యాంక్ పునరుద్ధరణ పనులతోపాటు ఇతర తక్షణ పనులను పూర్తి చేశారు. సైదాబాద్ జలమండలి సెక్షన్ పరిధిలో వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించటానికి చేపట్టిన పనులను సమ్మర్ యాక్షన్ పనులను ప్రణాళికాబద్ధంగా వాటిని సకాలంలో పూర్తి చేశారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఆస్మాన్ఘడ్ ఎస్బీహెచ్ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఆస్మాన్ఘడ్ కరణ్బాగ్ కాలనీల్లో చేపట్టిన ఆధునీకరణ పనులన్నీ పూర్తి దశకు చేరాయి.
చేతి పంపు( బోరింగ్)లు, సింథటిక్ ట్యాంకులు ఏర్పాటు
డివిజన్ పరిధిలోని చేపల మార్కెట్, హరిజన బస్తీల్లో పవర్ బోర్ల వద్ద సింథటిక్ ట్యాంక్లను ఏర్పాటు చేసి స్థానికుల నీటి కష్టాలను తొలగించారు. అదే విధంగా సెక్షన్ వ్యాప్తంగా ఎల్సీహెచ్ కాలనీ, ఏకలవ్యనగర్, గాంధీనగర్, పూసలబస్తీ, హరిజన బస్తీ, జీవన్జ్యోతి సంఘం తదితర ప్రాంతాల్లో చేతి పంపులు (బోరింగ్)లకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చారు.
కలుషిత తాగునీటి ఇబ్బందుల తొలగింపు..
కలుషిత తాగు నీటి ఇబ్బందులను తొలగించటానికి ప్రత్యేక చర్యలు తీసుకుని మరమ్మతులను చేపట్టి పైప్లైన్ల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఆస్మాన్ఘడ్ ఎస్బీహెచ్ కాలనీలో గత మూడు నెలలుగా కలుషిత తాగునీరు సరఫరా అవుతుండటంతో సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా పనులను చేపట్టి కాలనీవాసులను కలుషిత తాగునీటి ఇబ్బందులను తొలగించారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో కలుషిత నీరు సరఫరా అవుతుందని, ప్రజలను నుంచి ఫిర్యాదు వస్తుండటంతో అధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు స్పందించి వాటిని పరిష్కరించటానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల సమస్యలు పరిష్కరించాం
వేసవి కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించటానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం. నీటి ఎద్దడిని తొలగించటానికి చేతి పంపు(బోరింగ్)ల మరమ్మతులు, పవర్ బోర్ల వద్ద సింథటిక్ ట్యాంక్లను ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించాం. కలుషిత తాగునీటి ఇబ్బందులను తొలగించి, పైపులైన్లను ఆధునీకరణ చేశాం. మురుగునీటి వ్యవస్థల లీకేజీలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు తీసుకుని వాటి పనులను పూర్తి చేసి, ప్రజల కష్టాలను తొలగించాం.
– శ్రవణ్, జలమండలి సైదాబాద్ సెక్షన్ మేనే జర్