మేడ్చల్ రూరల్, మే 21 : మేడ్చల్ మండల పరిధిలోని రాజబొల్లారం గ్రామానికి చెందిన పలువురికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థిక సాయం మంజూరైంది. కురాకుల వరలక్ష్మికి రూ.65వేలు, కురాకుల శ్రీకాంత్కు రూ.27 వేలు, నాగరాజుకు రూ.20వేలు, ఆఫ్రిది కి రూ.32వేలు చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి శనివారం బోయినలిపల్లిలోని తన కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు శైలజా రెడ్డి, రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, కార్యదర్శి సుదర్శన్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్యాదవ్, మహేశ్, అనీల్, వెంకట్, శ్రీకాంత్, బన్నీ పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీకి చెందిన ఒకరికి..
మేడ్చల్ కలెక్టరేట్, మే 21 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఓం సాయి నగర్కు చెందిన విజయలక్ష్మికి రూ.1.5 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పత్రాన్ని మంత్రి అందశనివారం జేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్ అన్నంరాజు శ్రీనివాస్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్, నాయకులు శ్రీనివాస్, నాగేందర్, బద్రీనారాయణ మూర్తి పాల్గొన్నారు.
పోచారం మున్సిపాలిటీకి చెందిన ఇద్దరికి..
ఘట్కేసర్, మే 21 : అనారోగ్య సమయంలో సీఎం సహాయనిధి పేదలను ఆదుకుంటున్నదని పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కొండల్ రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్నానగర్కు చెందిన దయాకర్చారికి 60 వేలు, నారపల్లికి చెందిన యాదమ్మకు 18 వేలు సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరయ్యాయి. ఈ చెక్కులను మున్సిపాలిటీ చైర్మన్ బి.కొండల్రెడ్డి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నర్సింహ, బుచ్చిరెడ్డి,మురళీ లబ్ధిదారులు పాల్గొన్నారు.
పేదల పాలిట వరం..
బోడుప్పల్, మే21: ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరమని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. బోడుప్పల్ పరిధిలోని శ్రీనివాస నగర్కు చెందిన డి.అంజయ్య అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందారు. అనంతరం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.60వేల చెక్కు మంజురైంది. ఈ చెక్కును లబ్ధిదారులకు మేయర్ బుచ్చిరెడ్డి శనివారం తన నివాసంలో అందజేశారు.
జగ్గంగూడ గ్రామానికి చెందిన ఒకరికి..
శామీర్పేట, మే 21 : జగ్గంగూడ గ్రామానికి చెందిన దేవునిరి సుగుణకు సీఎం సహాయనిధి నుంచి రూ.57 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి ఆదేశాల మేరకు సర్పంచ్ చందుపట్ల విష్ణువర్ధన్రెడ్డి లబ్ధిదారులకు శనివారం అందజేశారు. వార్డు సభ్యుడు అనిల్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, సాయిబాబు, శివరామ్రెడ్డి, అశోక్, బాబూరావు పాల్గొన్నారు.