చర్లపల్లి, మే 19:రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధిచేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధి, టీఎస్ఐఐసీ కాలనీలోని సహస్ర లింగేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన శివపార్వతుల శాంతి కల్యాణానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో నిర్మించిన వంటశాలను హెచ్బీకాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి పనులు చేపట్టామన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సుదర్శన్రెడ్డి, సులోచన ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాస్రావు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు,నాయకులు వెంకటేశ్వర్రెడ్డి, సుధాకర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఏఎస్రావునగర్ డివిజన్ కమలానగర్కు చెందిన సంతోశ్కుమార్కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కును ఎమ్మెల్యే సుభాష్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, బాల్రాజు, మణెమ్మ, లక్ష్మీనారాయణ, సుదర్శన్రెడ్డి, బాల్నర్సింహ, శిరీషారెడ్డి, యాదగిరి, యాకయ్య, సాయిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా రామంతాపూర్ ఇందిరానగర్కు చెందిన ఉమేరాబేగంకు సీఎం ఆర్ఎఫ్నుంచి మంజూరైనరూ.2లక్షల50వేలఎల్ఓసీని ఎమ్మెల్యే ఆమెకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రవికుమార్, వెంకటేశ్వర్రెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నా రు. మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్కు చెందిన జి. అలి వేలుకు రూ.16వేలు, యుగంధర్రెడ్డికి రూ. 26,500, కుమారస్వామిగౌడ్కు రూ. 60,000ల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే, కార్పొరేటర్ ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్రెడ్డితో కలిసి అందజేశారు. కార్య క్రమంలో నాయకులు సుధాకర్, నాగేశ్వర్రెడ్డి, బాల్రెడ్డి, సుబ్బారెడ్డి, కామేశ్వర్రావు, కోటిరెడ్డి, మాలాద్రి, మాధ వరావు, శ్రీనివాస్, పాల్గొన్నారు.
భూగర్భ డ్రైనేజీ పనులు ప్రారంభం
మల్లాపూర్: మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ లక్ష్మీనగర్కాలనీలో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ జి.శ్రీనివాస్రెడ్డిలతో కలిసి గురువారం ఎమ్మెల్యే సుభాష్రెడ్డి రూ. 16 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జలమండలి డి.జి.ఎం సతీష్కుమార్, కాలనీవాసులు, టీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.