గాజులరామారం, మే 18: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న పాత నేరస్తుడిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఏసీపీ పురుషోత్తం యాదవ్, జగద్గిరిగుట్ట సీఐ పి.సైదులు ఈ కేసు వివరాలు వెల్లడించారు. వివేకానందనగర్లో నివాసముంటున్న మారుపల్లి కిరణ్ రాయ్ (39) పార్కు చేసిన బైక్లను చోరీకి పాల్పడుతున్నాడు. ఈ మేరకు బుధవారం జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలోని కేఎల్ బార్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటువైపు వచ్చిన కిరణ్ రాయిని అనుమానంతో పట్టుకొని విచారించగా జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో 8 , బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఒక బైక్ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. దీంతో పోలీసులు తొమ్మిది బైక్లు, రూ.4.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కిరణ్పై గతంలో కూకట్పల్లి పోలీస్స్టేషన్లో19, మియాపూర్లో కేసులు ఉన్నట్లు తేలిందన్నారు. వాహన దొంగను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఏసీపీ పురుషోత్తం అభినందించారు. ఈ సమావేశంలో డీఐ కె.కృష్ణప్రసాద్, క్రైం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.