దుండిగల్, మే 18 : దుండిగల్లోని అరుంధతి వైద్యశాలలో బుధవారం పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు అంగన్వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలకు అరంధతి వైద్యశాల డాక్టర్లు, వైద్య సిబ్బంది పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసమైన వారికి మందులు పంపిణీ చేశారు. అనంతరం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంచే శ్రమశక్తి అవార్డు పొందిన టీఆర్కేవీ నాయకురాలు నల్ల భారతి, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్కేవీ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ను రాజశేఖర్రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంఎల్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మర్రి లక్ష్మణ్రెడ్డి, ఆశ వర్కర్ల రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకులు రాములు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.