కేపీహెచ్బీ కాలనీ, మే 18 : దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు ఆధ్వర్యంలో వందమంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను.. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అందించిన విషయం తెలిసిందే. కాగా.. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మూడు చక్రాల స్కూటర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను దివ్యాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. దివ్యాంగులు స్వయం సమృద్ధిని సాధించే దిశగా సొంత నిధులతో మూడు చక్రాల స్కూటర్లను అందించినట్లు తెలిపారు. స్కూటర్లను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆవుల రవీందర్ రెడ్డి, జూపల్లి సత్యనారాయణ, స్థానిక నేతలు ఉన్నారు.
బీరప్ప ఆలయంలో పూజలు..
బాలాజీనగర్ ముష్కీపేట జనతానగర్లో బీరప్ప, పోచమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ వేడుకల్లో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాబురావు, ఆలయ కమిటీ సభ్యులున్నారు.