ఎర్రగడ్డ, మే 18 : ఎర్రగడ్డ డివిజన్లో ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నటరాజ్నగర్, సంజయ్నగర్లలో పాదయాత్ర నిర్వహించారు. నటరాజ్నగర్లో పెరిగిన జనాభాకు అనుగుణంగా తాగునీటి పైప్లైన్లను ఏర్పాటు చేయాలని.. సీవరేజీ పైప్లైన్లను విస్తరించాలని స్థానికులు కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే జలమండలి అధికారులకు సూచనలు చేశారు. వీలైనంత త్వరలో పనులను చేపట్టాలని ఆదేశించారు. పాదయాత్రలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత శాఖల అధికారులు స్వీకరించారు.. వాటన్నిటినీ పరిశీలించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. జలమండలి, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, బల్దియా శాఖల అధికారులు ఉన్నారు.
నిధుల కేటాయంపులో ఎర్రగడ్డకు ప్రాధాన్యత..
ఎర్రగడ్డ డివిజన్కు గత 7 ఏంండ్లలో అత్యధిక నిధులు కేటాయించి పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించటం జరిగిందని ఎమ్మెల్యే గోపీనాథ్ అన్నా రు. ఏజీ కాలనీ నుంచి నటరాజ్నగర్ మీదుగా రాజీవ్నగర్ ఉన్న ప్రధాన రహదారి నటరాజ్నగర్ వద్ద చాలా ఇరుకుగా ఉన్నందున వాహనదారులు నిత్యం అవస్థలు పడుతున్నారని.. వెంటనే ఈ రహదారి విస్తరణ జరిగేలా చర్యలు తీసుకుంటానన్నారు. కొందరు కోర్టుకు వెళ్లటం వల్ల రహదారి విస్తరణ జాప్యం జరిగిందని వివరించారు. పాదయాత్రలో భాగంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి వెంట నే నిధులను మంజూరు చేస్తామని స్థానికులకు ఆయన హా మీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫఖురేషీ, గంట మల్లేశ్, ఇస్మాయిల్ఖాన్, సూరి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మాగంటి సమీక్ష
బంజారాహిల్స్, మే 18: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధిపనులపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో యూసుఫ్గూడ సర్కిల్ డీఎంసీ రమేశ్, ఈఈ రాజ్కుమార్, ఖైరతాబాద్ సర్కిల్ డీఎంసీ మోహన్రెడ్డితో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని శ్రీనగర్ కాలనీ డీపార్కు అభివృద్ధిపనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్లారెడ్డిగూడ జలమండలి కార్యాలయం పక్కనున్న కమ్యూనిటీహాల్ స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ పర్సస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. రహ్మత్నగర్ డివిజన్లోని క్వారీ ల్యాండ్స్లో రూ.1.9 కోట్ల వ్యయంతో ప్లే గ్రౌండ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.