జూబ్లీహిల్స్, మే18 : పేద ప్రజలు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహించుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్తీలు, కాలనీలలో సామూహిక కార్యక్రమాల నిర్వహణకు సా మాజిక భవనాల స్థానంలో ఆధునిక తరహా ఫంక్ష న్ హాల్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూసుఫ్గూడ సర్కిల్లోని రహ్మత్నగర్, వెంగళరావునగర్, ఎర్రగడ్డ డివిజన్లలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లు ఏర్పాటు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ప్రణాళికలతో పేద ప్రజలకు ఉచితంగా సేవలందించే ఈ భారీ పంక్షన్హాల్ల నిర్మాణానికి రూపకల్పన చేస్తున్నారు. ఇందులో భాగంగా రహ్మత్నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ క్వారీ లాండ్లో రూ. 1 కోటి 45 లక్షలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ తొలిదశ నిర్మాణ పనులు చేపడుతున్నారు. వెంగళరావునగర్ డివిజన్ అయ్యప్ప గ్రౌండ్లో రూ. 5.25 కోట్లతో భారీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఎర్రగడ్డ జనప్రియ ఒవైసీ ప్లే గ్రౌండ్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు ప్రతిపదనలు సిద్ధం చేస్తున్నారు. రహ్మత్నగర్లో నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ పనులను 19 వ సర్కిల్ ఈఈ రాజ్కుమార్, ఏఈ జమీల్తో కలిసి పరిశీలించారు.
నేటి అవసరాలకు అనుగుణంగా ఫంక్షన్ హాల్ల ఏర్పాటు ..
సామాజిక భవనాల స్థానంలో నేటి అవసరాలకు అనుగుణంగా మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఉన్న కమ్యునిటీ హాల్లు పెరిగిన జనాభాకు ఎటూ సరిపోవడంలేదు. దీంతో ఆయా భవనాలు నిరుపయోగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సూచనలతో అందరి అవసరాలకు సరిపడే మల్టీ పర్పస్ ఫంక్షన్హాల్లకు రూపకల్పన చేశాం. పార్కింగ్కు స్థ లం లేని భవనాలలో సెల్లార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నాం. రహ్మత్నగర్లో పనులు ప్రారంభం కాగా అయ్యప్ప గ్రౌండ్లో త్వరలో పను లు ప్రారంభిస్తాం. ఎర్రగడ్డలో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లు ఏర్పాటుకు ప్రతిపదనలు సిద్దం చేస్తున్నాం.
– రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జీహెచ్ఎంసీ