వనస్థలిపురం, మే 18: సాహెబ్నగర్ త్రినేత్రాంజనేయ దేవస్థానం అభివృద్ధికి రూ.10కోట్లు మంజూరు చేశామని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. 5రోజుల పాటు నిర్వహించనున్న దేవస్థానం జాతర ఉత్సవాలను ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 4శతాబ్దాల చరిత్ర కలిగిన గొప్ప ఆలయం అన్నారు. భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిండంతోపాటు చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ప్రజల సంస్కృతి సంప్రదయాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందన్నారు. అనంతరం కేకే గార్డెన్స్ అధినేత కొయ్యలకొండ సుధాకర్ ఏర్పాటు చేసిన మహా ప్రసాద వితరణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్గౌడ్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్రెడ్డి, చింతల రవికుమార్, కర్నాటి అనిల్ చౌదరి, ఉమేశ్గౌడ్, దేవేందర్, శేఖర్రెడ్డి, సంగీత, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.