చిక్కడపల్లి, మే17 : నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలో రూ.65 లక్షలతో కొత్త పుస్తకాలు కొనుగోలు చేసి పాఠకులకు, పోటీ పరీక్షల అభ్యర్థులకు అందుబాటులో తెచ్చామని గ్రంథాలయం చైర్పర్సన్ ప్రసన్న రాంమూర్తి తెలిపారు. మంగళవారం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరులతో మాట్లాడుతూ… నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలోని అన్ని శాఖ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. సికింద్రాబాద్లో అత్యాధునిక వసతులతో రూ. 3 కోట్లతో నూతనంగా గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రంథాలయం పరిధిలోని 82 శాఖా గ్రంథాలయాలను అభివృద్ధి చేశామని, రూ.72 లక్షలతో 14శాఖ గ్రంథాలయాల్లో మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. నగర గ్రంథాలయం ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, అదేవిధంగా రూ.కోటి వ్యయంతో మరమ్మతులు చేసినట్లు తెలిపారు.