సీఈడీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
ఉచిత శిక్షణా తరగతులకు విశేష స్పందన
సుల్తాన్బజార్, మే 17 : అల్ప సంఖాక వర్గాలలో ఉన్న నిరుపేద యువతీ యువకులు ఉపాధిని పొంది అభివృద్ధి చెందాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ శాఖ, సీఈడీఎం ఆధ్వర్యంలో టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఉర్దూ మీడియంలో 8 తరగతులు, ఇంగ్లిష్ మీడియంలో 7 తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు. నిజాం కళాశాల వేదికగా కొనసాగుతున్న ఈ శిక్షణా తరగతులు 20 రోజుల పాటు కొన సాగుతాయని సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మైనార్టీ, ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ మహ్మద్ ఖలీల్ జమాల్ అన్నారు. నిరుపేద అభ్యరు ్థలకు ఈ తరగతులు ఎంతో దోహదం చేస్తాయి. చదువుకోవాలనే తపన కలిగి ఉన్న అభ్యర్థులకు ఆర్థిక స్థోమతతో ఇబ్బందులు కలుగుతున్న వారి కి ఈ శిక్షణా తరగతులు ఉపయోగపడాలనే లక్ష్యంగా సీఈడీఎం కృషి చేస్తుంది.ఈ శిక్షణా తరగతుల నిమిత్తం ఆన్లైన్లో 1900 మంది అభ్య ర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.ఈ అభ్యర్థులకు ఆఫ్లైన్లో 20 రోజుల పాటు కోచింగ్ ఇస్తున్నప్పటికీ ఆన్లైన్లో స్టడీ మెటిరీయల్ను అందించడం జరుగుతుందన్నారు.
20 రోజులు..15 తరగతులు..
టెట్ పోటీ పరీక్షలకు సిద్ధ్దమయ్యే అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. నిజాం కళాశాల వేదికగా కొనసాగనున్న ఈ శిక్షణా తరగతులు 20 రోజుల పాటు సాగుతాయి. సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో ఇంగ్లిష్ మీడియంలో 7 తరగతులు, ఉర్దూ మీడియంలో 8 తరగతులను నిర్వహిస్తున్నాం. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగపరుచుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సబ్బండ వర్గాలతో పాటు మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. కళాశాలలో ఈ ఉచిత శిక్షణా తరగతులను నిర్వహించేందుకు గాను సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.భీమాకు కృతజ్ఞతలు.
– డాక్టర్ మహ్మద్ ఖలీల్ జమాల్, ఇన్చార్జి డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ మైనార్టీ