సుల్తాన్బజార్, మే 17 : సీఎం కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.ముజీబ్ హుస్సేనీ అన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో విధులను నిర్వహిస్తూ మృతి చెందిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఖాళీలు లేకపోవడంతో డీఈవో రోహిణి వినతి మేరకు కలెక్టర్ శర్మన్ ఒకరికి కలెక్టరేట్ విభాగంలో, ఒకరికి ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో కారుణ్య నియామకం అయ్యారు. మంగళవారం టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, కార్యదర్శి ఎం.భాస్కర్ నేతృత్వంలో నాంపల్లిలోని జిల్లా శాఖ కార్యాలయంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్హు స్సేనీని మర్యాదపూర్వకంగా కలుసుకొని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఉద్యోగులు నష్టపోకుండా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కృషి చేస్తుందన్నారు.
ప్రతి ఒక్క ఉ ద్యోగికి టీఎన్జీవో సంఘం ఆధ్వర్యంలో న్యాయం జరుగుతుందన్నారు. కారుణ్య నియామకాలలో భాగంగా ఇద్దరికి ఇతర శాఖల్లో చోటు కల్పించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు, ్ల కలెక్టర్ శర్మన్కు కృతజ్ఞతలు తెలిపారు.టీఎన్జీవో స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు కేఆర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ.. డీఈవో కార్యాలయంలో 2 కారుణ్య నియామకాలను చేపట్టినందుకు గాను కలెక్టర్ శర్మన్, డీఈవో ఆర్.రోహిణి, డీఆర్వో సూర్యలత, టీఎన్జీవో హైదరాబా ద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముజీబ్ హుస్సేనీ, ఏవో అయ్యప్ప, సీతారాం,ఆశ్విని, డీఈవో అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డికి కృతజ ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమా ర్, సంయుక్త కార్యదర్శి కె. శ్రీనివాస్, పీఆర్వో జహంగీర్, సభ్యులు ముజీబ్, వైదిక్ శస్త్ర, శంకర్,స్కూల్ ఎడ్యుకేషన్ యూనిట్ సభ్యులు జీవన్, సొహైల్, రమేశ్, సూర్య,ఫయాజ్, సుదర్శన్,అఖిల్, కృష్ణ, అజీజ్, సాదత్, రవి, ఇమ్రాన్, మహేందర్, నాగప్రవేశ్, కిరణ్, పరమేశ్ పాల్గొన్నారు.