చిక్కడపల్లి,మే 17 : రాజకీయ అజాత శత్రువు రాజేశ్వర్ అని పలువురు వక్తలు అన్నారు.మంగళవారం ఆర్టీసీ కల్యాణ మండంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర మాజీ చైర్మన్ రాజేశ్వర్ ప్రథమ వర్థంతి సభను నిర్వహించారు.ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్,ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాచంద్రరావు,టీపీసీసీ రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎం.అంజన్కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జాతీయ ఉపాధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీహెచ్ హన్మంతు,బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్,మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్, కేశవ్ తదితరులు హాజరై నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ సతీమణి నాగమణి, కుమారులు రాకేశ్, రాజీవ్, భరత్, రవికాంత్, మాజీ మంత్రి చంద్రశేఖర్, అనిల్కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ కల్పన యాదవ్, అంజిరెడ్డి,గజ్జల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.