ఖైరతాబాద్, మే 17 : రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్, సోమాజిగూడ, సనత్నగర్ డివిజన్లలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్పొరేటర్లు పి. విజయా రెడ్డి, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, కొలను లక్ష్మి రెడ్డిలు సర్కిల్ -17 డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి నేతృత్వంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్, ఈఈ ఇందిరా, డీఈ చైతన్య, ఏఈలు చరణ్, శ్రీనివాస్ రావు, ఎంటమాలజీ ఏఈ భాస్కర్తో మంగళవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సీవరేజీ పనులు, స్ట్రీట్ లైట్లు, శానిటేషన్, పార్కుల్లో పారిశుద్ధ్య చర్యలు, నీటి సౌకర్యాలు, మట్టికుప్పల తొలగింపు, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల కూల్చివేతలపై చర్చించారు. త్వరలోనే కార్యాచరణ సిద్ధ్దం చేసి పనులను చేపట్టాలని నిర్ణయించారు.