కందుకూరు, మే 17 : సమస్యలపై అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని నేదునూరు, జైత్వారం, తిమ్మాపూర్, లేమూరు, అగర్మియాగూడ, దన్నారం, దెబ్బడగూడ, సర్పంచులు రామకృష్ణారెడ్డి, సదాలక్ష్మి, గోపాల్రెడ్డి, పరంజ్యోతి, భూపాల్రెడ్డి, శ్రీదేవి, సాధ మల్లారెడ్డి, శ్రావణి, ఎంపీటీసీలు రాములు, యాదయ్య, ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిషత్ సమావేశపు హాల్లో ఎంపీపీ మంద జ్యోతి పాండు అధ్యక్షతను మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని మండలంలో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కందుకూరు ఎంపీటీసీ సురుసాని రాజశేఖర్రెడ్డి పట్టుబట్టారు. వైద్యాధికారి సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదనం వ్యక్తం చేశారు. కందుకూరు- యాచారం రోడ్డులో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నదని ఏఈ రమేశ్గౌడ్కు ఆయన వివరించారు. తమ గ్రామంలో అనుమతి లేకుండా ఆయిల్ ఫ్యాక్టరీకి ఎలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేశారని సర్పంచ్ సదాలక్ష్మి పుల్లారెడ్డి ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులతో పాటు ఇతర అధికారులు సమాచారం ఇవ్వడం లేదని సర్పంచులు, ఎంపీటీసీలు తెలిపారు.
ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వాలని ఎంపీపీ జ్యోతి పాండూ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీటీడీ నర్సింలు సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు అధికారుల తీరుతో సక్రమంగా లబ్ధిదారులకు చెందడం లేదని సర్పంచులు రామకృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, సోమ్లానాయక్, భూపాల్రెడ్డి, పరంజ్యోతి, శ్రీదేవి, కాకి ఇందిరమ్మ, పరంజ్యోతి, జ్యోతి శేఖర్ గుప్తా, ఎంపీటీసీలు సురుసాని రాజశేఖర్రెడ్డి, రాములు, యాదయ్య, ఎల్లారెడ్డి, మల్లేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, వైఎస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి, తాసీల్దార్ జ్యోతి, ఎండీఓ నర్సింహలు, డీఈ జగన్మోహన్రెడ్డి, అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.