ఉప్పల్, మే 17 : ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని గాంధీగిరిజన బస్తీ కమ్యూనిటీహాల్లో అంతర్జాతీయ హైపర్టెన్షన్ డే సందర్భంగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలన్నారు. బీపీ, షుగర్, తదితర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ నారాయణరావు, ప్రాజెక్టు ఆఫీసర్ రఘునాథ్స్వామి, డాక్టర్ సౌందర్యలత, సూపర్వైజర్ బోగ ప్రకాశ్, భవాని, స్పందన, జీవనజ్యోతి, ఇస్రాత్, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డం రవికుమార్, గరిక సుధాకర్, లక్ష్మీనారాయణ, మేకల ముత్యంరెడ్డి, డాక్టర్ చారి, సోమిరెడ్డి, నందికంటి శివ, లింగానాయక్, సూరం శంకర్, మహబూబీ, యాదమ్మ, కాలనీవాసులు పాల్గొన్నారు.
వాడవాడలా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
రామంతాపూర్,మే 17 : ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మంగళవారం హబ్సిగూడ డివిజన్ పరిధిలోని వెంకట్రెడ్డినగర్లో వాడ, వాడ తిరుగుతూ ప్రజలను పలుకరిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, తాగునీరు సమస్య ఉందని ప్రజలు ఎమ్మెల్యేకు చెప్పారు. సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పటి తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్వోసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
తీవ్రమైన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న డివిజన్కు చెందిన ప్రదీప్కుమార్కు మంజూరైన రూ.31వేల ఎల్వోసిని ఆయనకు పాదయాత్రలో అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు జలమండలి మేనేజర్ జాన్ షరీఫ్, డీజీఎం రజనీకాంత్రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, ఎస్డబ్ల్యూ డీడీ చందన, టీఆర్ఎస్ నాయకులు డివిజన్ అధ్యక్షుడు డాక్టర్ బీవీచారి, కంచర్ల సోమిరెడ్డి, నందికంటి శివ, జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గడ్డ రవికుమార్, సూరంశంకర్, అక్బర్, నాని, హరీశ్, గడ్డం వెంకటసాయి, బిల్లకంటి యాదయ్య, మహబూబి, యాదమ్మ, ధనలక్ష్మి, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.