హయత్నగర్, మే 17: డివిజన్ పరిధిలోని కాలనీల్లో జరుగుతున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని హయత్నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం హయత్నగర్ డివిజన్ పరిధిలోని సామనగర్ నుంచి వస్పరినగర్ కాలనీ వరకు జరుగుతున్న నూతన సీసీ రోడ్డు పనులను మున్సిపల్ డీఈ దామోదర్, ఏఈ నరేంద్ర తేజ, వర్క్ ఇన్స్పెక్టర్ సురేశ్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.
విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు…
విధుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని వాటర్ బోర్డు సిబ్బందిని కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి హెచ్చరించారు. అన్మగల్ హయత్నగర్ పాత గ్రామంలో కార్పొరేటర్, స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో మంచినీరు రావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకపై ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని వాటర్ వర్క్స్ సిబ్బందికి సూచించారు.