ఉప్పల్, మే 16: తెలంగాణ ఆటోమోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, తెలంగాణ ఆటో, క్యాబ్ లారీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాచారంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ఫిట్నెస్ రెన్యువల్ పెనాల్టీని నిరసిస్తూ నాచారం వైజయంతి థియేటర్ ప్రాంతం లో ప్లకార్డులతో ధర్నా చేపట్టారు. ఈకార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరై మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు అన్యా యం చేసేలా ఉన్న జీఓలను వెంటనే కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అపరాధ రుసుం నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించాలన్నారు. ఫిట్నెస్ రెన్యువల్ ఫెనాల్టీ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పాండునా యక్, హేమంత్, కుమార్, అంజి, వెంకటేశ్, రవి, శాతం రమేశ్, రామాంజనేయులు, మధా ర్, మహేశ్, కృష్ణ, నేతలు వెంకటేశ్వర్రెడ్డి, రవికుమార్, సుధాకర్, సాయిజెన్ శేఖర్, ముత్యంరెడ్డి, అంజి, శ్రీధర్, నేతలు పాల్గొన్నారు.
సినిమాలు సమాజానికి ఆదర్శం కావాలి
సమాజానికి ఆదర్శంగా నిలిచే సినిమాలు రావాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆరోగ్యం క్షీణించిన భర్తను కాపాడుకోవడానికి వృద్ధ మహిళ చేసిన పోరాటమే ఇతివృత్తంగా తీసిన ‘లతా భగవాన్ కరే’ అనే మరాఠి చిత్రానికి ఫిలింఫేర్ అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని ఫిలింఛాంబర్లో తెలంగాణకు చెందిన దర్శక, నిర్మాతలు కృష్ణ, నవీన్తో పాటు, నటి లతా భగవాన్ కరేలను సోమవారం సత్కరించారు. టీఆర్ఎస్పార్టీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో యూనిట్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి హాజరైనారు. కార్యక్రమంలో నిర్మాత ప్రసన్నకుమార్, నేతలు వెంకటేశ్వర్రెడ్డి, నిర్మాత రవికుమార్, సుధాకర్, శ్రీధర్, సునీల్ పాల్గొన్నారు.