దుండిగల్,మే16: నిజాంపేటను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా మారేలా కృషి చేస్తున్నామని మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి అన్నారు. సోమవారం కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు ఆమె కమిషనర్ వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు.నిజాంపేట్ ఎంట్రన్స్లో రోడ్డుకు ఇరువైపులా రూ.1.10 కోట్లతో నిర్మించనున్న ఫుట్పాత్ పనులను మేయర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుబ్బారెడ్డి, నిజాంపేట్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు పద్మప్రసాద్,బీసీ సెల్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణముదిరాజ్,ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి యాదగిరి,9వ డివిజన్ ఎస్సీ సెల్ప్రెసిడెంట్ గోపి,కార్పొరేషన్ ఎస్ఈ శంకర్లాల్, డీఈ దానయ్య ఉన్నారు.
n కార్పొరేషన్ పరిధి 12వ డివిజన్ పరిధిలోని శివాలయం పక్క వీధిలో రూ.35లక్షలతో వైట్ టాపింగ్ సీసీ రోడ్డు పనులు, రూ.11లక్షలతో ఇందిరమ్మ కాలనీ ఫేజ్-3లో సీసీ రోడ్డు, రూ.10లక్షలతో ప్యాచ్ వర్క్ పనులు, రూ.8.50 లక్షలతో రాజీవ్గృహకల్ప 35వ బ్లాక్ వద్ద సీసీ రోడ్డు పనులు, రూ.3 లక్షలతో వరలక్ష్మినివాస్ వద్ద సీసీ రోడ్డు పనులకు మేయర్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం వైకుంఠధామం నిర్మాణ పనులను మేయర్ పరిశీలించారు.కార్యక్రమంలో కార్పొరేషన్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ పద్మప్రసాద్, బీసీసెల్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, 12వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వెంకటేశ్, ప్రధాన కార్యదర్శి మురళి,అనుబంధ కమిటీల సభ్యులు శ్రీనివాస్, బాలరాజు, ఇస్మాయిల్, సురేశ్, ప్రశాం త్, శ్రీను, రమణ, రమేశ్, మహిళా ప్రెసిడెంట్ తులసి, నవ్య, 9వ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గోపి, కార్పొరేషన్ ఎస్ఈ శంకర్లాల్, డీఈ దానయ్య ఉన్నారు.