రవీంద్రభారతి, మే 16: తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ వారి ఆధ్వర్యంలో పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల 614 జయంతి మహోత్సవాలు సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాంత బయోటెక్స్ చైర్మన్ పద్మభూషణ్ డా.వరప్రసాద్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమాచార్య జయంతిని పురస్కరించుకుని ప్రముఖ సంగీత గురువుల శిష్య బృందంతో సంకీర్తన గాన ఝరి రసమ్యంగా సాగాయన్నారు. వాగ్గేయకారులు ప్రాచుర్యంలో ఉన్న సంకీర్తలతో పలు అరుదైన కీర్తనలను మధురంగా గానం చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం, వెంకట్ గరికపాటి వ్యాఖ్యానంతో రూపొందించిన అన్నమయ్య అన్నమయ్య విరచిత సంకీర్తనల వ్యాఖ్యానం గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.ప్రభాకర్ రావు, సినీ సంగీత దర్శకులు సాలూరి వాసురావు, ప్రముఖ సంగీత విద్యాంసురాలు, నేపథ్య గాయని శ్రీనిధి వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం, పలువురు సంగీత విద్వాంసులు, శిష్య బృందంచే తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించి పలువురిని మంత్రముగ్ధులను చేశారు.