ఎల్బీనగర్, మే 16 : కొత్తపేట డివిజన్లోని సమతాపురి కాలనీలోని బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ను జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం సీజ్ చేశారు. అనుమతి లేకుండా స్విమ్మింగ్ పూల్ నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించి మనోజ్ అనే బాలుడి మరణానికి కారణమైన నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. స్విమ్మింగ్పూల్ నిర్వాహకుడు అశోక్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే తమ కుటుంబానికి న్యాయం చేయాలని మనోజ్ కుటుంబ సభ్యులు బ్లూ ఫ్యాబ్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆందోళన చేశారు.