మెహిదీపట్న, మే 16 : కోళ్లను సరఫరా చేసే క్రమంలో.. వచ్చిన లాభాన్ని పంచుకునే విషయంలో ఇద్దరు డీసీఎం వ్యాన్ డ్రైవర్ల మధ్యన గొడవ తలెత్తింది. రూ.2 వేల కోసం చంపుతానని బెదిరించడంతో స్నేహితులు, సోదరుడితో కలిసి కత్తులతో పొడిచి తోటి డ్రైవర్ను హతమార్చిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
సోమవారం లంగర్హౌస్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. చాంద్రాయణగుట్ట బండ్లగూడ షాహీన్నగర్కు చెందిన జహంగీర్(23), మహ్మద్ అష్రఫ్(37) నాంపల్లిలోని బిస్మిల్లా చికెన్ సెంటర్లో కోళ్లను సరఫరా చేసే డీసీఎం డ్రైవర్లుగా పనిచేసేవారు. ప్రతిరోజు డీసీఎంలో కోళ్లను తీసుకుని వెళ్లి జిల్లాల్లోని చికెన్ షాపుల్లో వేసి వస్తుంటారు. ఈ క్రమంలో ట్రిప్పుకు రూ.3వేల నుంచి 4వేల వరకు లాభం వస్తుంది. ఇందులో అష్రఫ్ 60శాతం తీసుకొని జహంగీర్కు 40శాతం ఇచ్చేవాడు.
బెదిరించాడని చంపేశారు..!
అష్రఫ్ డబ్బులు ఎక్కువ తీసుకొని జహంగీర్కు తక్కువ ఇవ్వడంతో పలుమార్లు గొడవ పడ్డారు. ఈ నెల 12న సాయంత్రం డబ్బుల విషయంలో జహంగీర్కు, అష్రఫ్కు గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన జహంగీర్ అష్రఫ్ను చంపుతానని బెదిరించి ఇంటికి వెళ్లి పోయాడు. ఈ విషయా న్ని అష్రఫ్ తన స్నేహితులు మీర్ ఇనాయత్ అలీ అలియాస్ అర్బాజ్(22), మహ్మద్ హబీబ్(26), తన సోదరుడు మ హ్మద్ షఫీ(22)లకు చెప్పాడు. దీంతో జహంగీర్ను ఎలాగై నా హతమార్చాలని పథకం వేసిన నలుగురు మాట్లాడుకుందామని జహంగీర్ను లంగర్హౌస్ రింగ్ రోడ్డు, పీవీ నర్సింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నం.96 సమీపంలోని వైఫై బార్ వద్దకు పిలిచారు.
అప్పటికే కత్తులతో సిద్ధంగా ఉన్న వీరంద రూ జహంగీర్ రాగానే ఒక్కసారిగా దాడి చేసి హతమార్చి అ క్కడి నుంచి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం రాత్రి రింగ్రోడ్ ప్రాంతంలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండలం డీసీపీ జో యల్ డేవిస్ ఆదేశాలతో ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ.శివమారుతి నేతృత్వంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.