కాచిగూడ, మే 14: గుర్తుతెలియని వ్యక్తి ఫోన్లో మాయమాటలు చెప్పి..రూ.47,500లను తస్కరించిన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బర్కత్పురకు చెందిన సుదర్శన్ గోయల్(62) విశ్రాంత ఉద్యోగి. శుక్రవారం ఆగంతకుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నానంటూ. ఓటీపీ తెలుసుకొని.. డబ్బులు తస్కరించాడు.
ఓటీపీ అడిగి..
ఖైరతాబాద్, మే 14 : క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ అడిగి దోచుకున్నారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిర్మల్ జిల్లా మదోల్ మండలం, రమ్తేబ్ గ్రామానికి చెందిన నవీన్కుమార్ విద్యార్థ్ధి. సోమాజిగూడలో మెన్స్ హాస్టల్లో ఉంటున్నాడు. ఫిబ్రవరిలో ధని క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి ధని బ్యాంకుకు సంబంధించిన వారమని, ఓటీపీ తెలుసుకొని.. మూడు దఫాలో మొత్తం రూ.17,500 తస్కరించారు.
కీ బోర్డులు ఆర్డర్ ఇచ్చి..
సిటీబ్యూరో, మే 14(నమస్తే తెలంగాణ): ఓ యువ వ్యాపారికి కంప్యూటర్ కీ బోర్డులు ఆర్డర్ ఇచ్చి.. అకౌంట్ ఖాళీ చేశారు ఆగం తకులు. కొంపల్లికి చెందిన బాధితుడు ఇన్ఫోటెక్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల గూగుల్లో తన షాపునకు సంబంధించిన ప్రకటన ఇచ్చా డు. కునాల్ చౌదరి, మంజిత్ల పేరుతో ఇద్దరు ఫోన్ చేసి.. తమకు 50 కీ బోర్డులు కావాలని ఆర్డర్ పెట్టారు. మొత్తం 11వేల బేరం కుదర డంతో వారు డబ్బులు పంపిస్తామని, మా బ్యాంక్ అకౌంట్ను, మీఇంటర్నెట్ బ్యాంకింగ్కు లింక్ చేసి.. రూ.5 పంపించమని చెప్పారు. సదరు వ్యాపారి అలా చేయగానే పది రూపా యలు వచ్చాయి. ఆ తర్వాత బాధితుడి అకౌం ట్ నుంచి రూ.1.59 లక్షలు గుర్తు తెలియని ఖాతాలోకి బదిలీ అయ్యాయి.
ప్రసాదం కోసం..
ఖైరతాబాద్, మే 14 : ఆన్లైన్లో ప్రసాదం కోసం ఆర్డర్ ఇస్తే….బ్యాంకు ఖాతా నుంచి రూ. 50వేలు మాయమయ్యాయి. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….పంజాగుట్టలోని రెగెన్సీ జీనత్ అపార్ట్మెంట్స్లో నివాసముండే ఆరతి బండి ఇటీవల కాశీ విశ్వనాథుడి ప్రసాదం కోసం ఆన్లైన్లో డెలివరీ డాట్ కమ్ వెబ్సైట్లో ఆర్డర్ ఇచ్చారు. అయితే పార్సిల్ ఆలస్యమైంది. దీంతో కస్టమర్ కేర్ నంబరును వెబ్సైట్ ద్వారా తెలుసుకొని దానికి ఫోన్ చేయగా, రాహుల్ కుమార్, పటేల్లు లైన్లోకి వచ్చారు. ట్రాకింగ్ వివరాలు చూస్తున్నామని, అంత వరకు ఎనీ డెస్క్ యాప్ వేసుకోవాలని సూచించారు. ఆమె యాప్ను ఇన్స్టాల్ చేసుకోగానే కొద్ది సేపటికి రూ.50వేలు డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది.తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు.