గాజులరామారం, మే 14 : మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని సాబెర్నగర్లో రూ.25 లక్షలు, రాజన్న బస్తీలో రూ.35 లక్షలతో నూతనంగా చేపడుతున్న తాగునీటి సరఫరా పైపులైన్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నవాబ్, పీఏసీఎస్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, వార్డు సభ్యులు మసూద్, నాయకులు అబిద్, ఇబ్రహీం, సింగారం మల్లేశ్, చందు ముదిరాజ్, ఇమ్రాన్బేగ్, చెట్ల వెంకటేశ్, మురళి, తారాసింగ్, ఖుర్షీదబేగం, అబ్బుబాకర్, మజర్ఖాన్, లక్ష్మణ్, బబిత దేవి, షేక్ నయీం, నదియ బేగం, అబ్దుల్ సమీ, బురుగ సుధ, యేసుబాబు, రాజు, శ్యామల, రత్నంరాజు, పృథ్వీరాజ్, జయరాజు, బాలు, బెంజమిన్, జోజుబాబు, ఎండీ. మునావర్, తులసీ, ఆదిలక్ష్మి, నాగమణి, నర్సమ్మ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన విష్ణు ప్రియ
గాజులారామారం డివిజన్ పరిధిలోని విష్ణుప్రియ ఎన్క్లేవ్లో తాగునీటి సమస్యకు రూ.2 కోట్లతో పైపులైన్లు, రూ. 20 లక్షలతో పార్కు అభివృద్ధి, రూ.11 లక్షలతో ఓపెన్ జిమ్కు నిధులు మంజూరు చేసిన సందర్భంగా శనివారం కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకవచ్చారు. ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తా..
దుండిగల్, మే14 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. 8వ వార్డులో సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్ సాయియాదవ్ నేతృత్వంలో కాలనీవాసులు శనివారం పేట్బషీరాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సీసీ రోడ్లు, మిషన్ భగీరథ పథకం కింద పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుతో పాటు విద్యుత్ సింగిల్ ఫేజ్ నుంచి త్రీఫేస్కు మార్చి సమస్యను పరిష్కరించాలని కోరగా ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎమ్మెల్యేను కలిసిన ప్రసూననగర్ వాసులు ..
కుత్బుల్లాపూర్, మే 14 : జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ప్రసూన నగర్లో సీసీరోడ్లు, ఓపెన్నాలా నిర్మాణానికి కృషి చేయాలని కోరుతూ.. కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే వివేకానంద్కు వినతిపత్రాన్ని అందజేశారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలైన సీసీరోడ్లకు రూ.75 లక్షలు, ఓపెన్నాలా నిర్మాణానికి రూ.42 లక్షలతో వ్యయప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కాలనీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సారవంతమైన మట్టిని అందించాలి
సారవంతమైన మట్టిని అందించాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. భారతీయ ఆధ్యాత్మిక గురువు సద్గురు నేతృత్వంలో ప్రారంభించిన సేవ్ సాయిల్ ఉద్యమం లండన్ నుంచి కోయంబత్తూర్ వరకు బైక్పై ప్రయాణిస్తూ ప్రచారం చేస్తున్నారని జూన్ 15న హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్న సందర్భంగా అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా వాల్పోస్టర్ను ఆవిష్కరించి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.