దుండిగల్, మే14 : ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. శనివారం శంభీపూర్లోని ఆయన కార్యాలయానికి పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తరలి వచ్చి తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు అందజేశారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధి శామీర్పేట్ మండలంలో నెలకొన్న సమస్యలపై ఎంపీపీ దాసరి ఎల్లుబాయి ఆధ్వర్యంలో ఎంపీటీసీలు ఇందిర, సాయిబాబా, మౌనిక వరప్రసాద్, ఇందిరరాజిరెడ్డి, అశోక్రెడ్డి, మురహరిపలి సర్పంచ్ భాస్కర్ ఎమ్మెల్సీని కలిసి వినతిపత్రం అందజేశారు.
n దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బౌరంపేటలో సమస్యలను పరిష్కరించాలని, ఇందిరమ్మ కాలనీలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించాలనీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎమ్మెల్సీ శంభీపూర్రాజును కోరారు. మేడ్చల్ జిల్లా గ్రంథాయ సంస్థ ఛైర్మన్ నాగరాజ్యాదవ్, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, విజయశేఖర్గౌడ్, మాజీ కార్పొరేటర్ సురేశ్రెడ్డి, నాయకులు మురళీయాదవ్, ధర్మారెడ్డి ఎమ్మెల్సీని కలిసిన వారిలోఉన్నారు.
n ఈ నెల 28న ప్రగతినగర్లో నిర్వహించే దివంగత నేత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రంగారాయ ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు ఎమ్మెల్సీ శంభీపూర్రాజును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు రాఘవేందర్రావు, ఆగం పాండుముదిరాజు, చిట్లదివాకర్, రవికిరణ్, పైడి మాధవి, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కాసాని వీరేశ్, సుబ్బారావు, సాంబశివారెడ్డి, అజయ్, నర్సింహారావు, జస్వంత్, సతీశ్రెడ్డి, శ్రీనివాస్, కల్యాణ్ పాల్గొన్నారు.
n నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు శనివారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేశం, ఏనుగుల శ్రీనివాస్రెడ్డి, ఆగం రాజు, శ్రీనివాస్ యాదవ్, కో-అప్షన్ సభ్యులు తలారీ వీరేశం, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు కొలన్ శ్రీనివాస్రెడ్డి, కాసాని వీరేశ్, కొలన్ సునీల్రెడ్డి, రవికాంత్ ఉన్నారు.