బాలానగర్/కేపీహెచ్బీ కాలనీ, మే 14: ప్రతి పేదింటి ఆడబిడ్డ పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నా రు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో 80 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా ఫతేనగర్ డివిజన్కు చెందిన 21 మంది లబ్ధిదారులకు స్థానిక కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. కాలనీలు, బస్తీల్లో సైతం కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు.కూకట్పల్లిలోని అన్ని ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా, పార్కులుగా మార్చడం, శ్మశానవాటికల అభివృద్ధితో పాటు రోడ్లు, డ్రైనేజీ సమస్యలన్నీ పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలు అబద్ద ప్రచారాలు చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్పొరేటర్ నర్సింహయావ్, సబీహాబేగం, సతీశ్గౌడ్ ఉన్నారు.
ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
కేపీహెచ్బీ కాలనీ,మే14: కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ లో నూతనంగా నిర్మించిన శ్రీఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు శివుడికి అభిషేకంతో పాటు నవగ్రహ పూజలు చేశారు. కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, నేతలున్నారు.