యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17: “శ్రీ లోగిళ్లు డెవలపర్స్.. రియల్ ఎస్టేట్ రంగంలో పరిచయమే అక్కర్లేని సంస్థ. గత పదేండ్ల క్రితం ప్రస్థానాన్ని మొదలు పెట్టిన ఈ సంస్థ వందల ఎకరాల విస్తీర్ణంలో భూములను అభివృద్ధి చేసి విక్రయించి రియల్ ఎస్టేట్ రంగంలో రారాజుగా వెలుగొందుతున్నది. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునేవారి అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ధరల్లో అందించడమే లక్ష్యంగా సంస్థ డైరెక్టర్లు కృషిచేస్తున్నారు. ‘యాదాద్రి’ కేంద్రంగా నలు దిశలా తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు 12 వెంచర్లను ఏర్పాటుచేసి 3వేలకు పైగా కస్టమర్లకు శ్రీలోగిళ్లు డెవలపర్స్ చేరువైంది.”
2012 సంవత్సరంలో ప్రారంభమైన ‘శ్రీలోగిళ్లు డెవలపర్స్’ తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నది. మొత్తం నలుగురు సభ్యులు ప్రభాకర్రెడ్డి, సురేశ్రెడ్డి, రమేశ్కుమార్, మాధవరెడ్డి కలిసి ఈ సంస్థను నెలకొల్పారు. తెలంగాణ తిరుపతిగా యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహస్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో ‘శ్రీ లోగిల్లు డెవలపర్స్’ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వెంచర్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. డీటీసీపీ, హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీపడడం లేదు. విశాలమైన రోడ్లు, అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులను కల్పిస్తుండడంతో కస్టమర్లు ఫిదా అయి ఇక్కడి లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారు, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దీర్ఘకాలానికి పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తక్కువ బడ్జెట్ శ్రేణిలో ప్లాట్లను అందిస్తున్నది శ్రీలోగిళ్లు వెంచర్స్ యాజమాన్యం.
నగరాలకు నలువైపులా శ్రీలోగిళ్లు వెంచర్స్
హైదరాబాద్, యాదాద్రి వంటి నగరాలకు నలువైపులా శ్రీలోగిళ్లు వెంచర్స్ గ్రూప్ వెంచర్లను ఏర్పాటు చేసి అన్ని వర్గాలకు అందుబాటు ధరల్లో నివాసయోగ్యమైన స్థలాలను అందుబాటులో తీసుకువస్తోంది. ఇప్పటికే యాదాద్రి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలో ఉన్న మాసాయిపేట, పెద్దకందుకూరు గ్రామాల్లో వెంచర్లను అన్ని అనుమతులు తీసుకొని కస్టమర్లకు నాణ్యమైన ప్లాట్లను అందించింది. వెనువెంటనే శ్రీశైలం హైవేలోని కందుకూరు వద్ద కూడా నాలుగు వెంచర్లను ప్రారంభించింది. ఘటేకేసర్ మండలంలోని ఏదులాబాద్, బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలోనూ వెంచర్లు కార్యరూపంలోకి వచ్చాయి. ప్రస్తుతం వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని భువనగిరి మండలం అనంతారం గ్రామం వద్ద మరో అత్యాధునికంగా మరో వెంచర్ను లాంచ్ చేశారు.
కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతున్నాం..
రియల్ రంగంలో పారదర్శకత, కస్టమర్లకు విశ్వాసం, ఆర్థిక భద్రత కలిగించేలా ప్రాజెక్టులను చేపడుతున్నాం. యాదాద్రి అభివృద్ధిని దృష్టి లో పెట్టుకుని హైదరాబాద్- వరంగల్ హైవే, ఇతర ముఖ్యమైన ప్రధాన రహదారులకు చేరువలో వెంచర్లను ఏర్పాటు చేస్తున్నాం. మా సంస్థపై నమ్మకంతో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్న కస్టమర్ల నమ్మకాన్ని నిలబెడుతున్నాం. ఇప్పటివరకు మూడు వేలకు పైగా కస్టమర్లకు చేరువయ్యాం. ఇది మా సంస్థకు చాలా అనందం కలిగించే విషయం. రానున్న రోజుల్లో కూడా మరింత ప్రొఫెషనల్గా సేవలు అందించే దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాం.మా వద్ద పాట్ల కొనుగోలు, మరిన్ని వివరాల కోసం సెల్: 9000022899 నంబర్ను సంప్రదించవచ్చు.