మియాపూర్, జనవరి 11 : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా..మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవకర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదా ఫంక్షన్హాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్వర్లు, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, అనీల్రెడ్డి, రాజేశ్, కాశీనాథ్, మోజెస్, పోశెట్టి, రాములు, రాజు, నాగేశ్వర్రావు, రవి, మహిళా నేతలు రాజ్యలక్ష్మీ, మధులత, శిరీష, మంజుల, బీబీ, స్వప్న, లావణ్య, స్వరూప, వరలక్ష్మి, దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
ఆరాధనామహోత్సవాలు..
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషీగూడలో ఫుల్ గాస్పెల్ చర్చి ప్రతిష్ఠ ఆరాధనా మహోత్సవాలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ప్రముఖ సువార్తీకులు ఇవాంజలిస్ట్ విల్సన్ వర్గీస్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సువార్తీకులు డాక్టర్ సామ్యూల్ డేవిడ్, రెవరెండ్ ఇజ్రాయిల్, ఇగ్నియేషన్, డాక్టర్ విప్పర్తి, పాస్టర్లు, క్రిస్టియన్లు పాల్గొన్నారు.