శేరిలింగంపల్లి, మే 7: రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందింది. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డీఎల్ఎఫ్ ప్రాంతానికి చెందిన సుకినే నాగరాణి(23) నానక్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఓ హాస్పటల్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని డీఎల్ఎఫ్ కాలనీకి ద్విచక్రవాహనంపై తన స్నేహితురాలు హైమావతితో కలిసి బయలుదేరింది. మార్గమధ్యలో గచ్చిబౌలి స్టేడియం వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా లింగంపల్లి వైపు నుంచి ట్రిపుల్ఐటీ వైపు వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో నాగరాణి, హైమావతిలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, అప్పటికే నాగరాణి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హైమావతి గాయాలతో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన ప్రణయ్ పరారీలో ఉన్నాడు. కాగా, నాగమణి తలకు హెల్మెట్ ధరించలేదని పోలీసులు తెలిపారు.