సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): ఒడిషా కేంద్రంగా నగరంలో జరుగుతున్న గంజాయి విక్రయాలపై హైదరాబాద్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అ ధికారులు దాడులు జరిపారు. గంజా యి విక్రయాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఒడిషాకు చెందిన గులాం రసూల్(32) స్వస్థలం నుంచి గంజాయి తీసుకొచ్చి నగరంలోని చాప ల్ రోడ్డులో టీ, కాఫీ, స్నాక్స్ వ్యాపారులైన మహమూద్ ఖాన్ (48), చాంద్ బాయి (45), బిస్మిల్లా ఖాన్ (46), ఎస్కే.ముజాహిద్ (32), తాజుద్దీన్ ఖా న్ (45)లకు సరఫరా చేస్తాడు. ఈ ఐదుగురు వ్యాపారులు గంజాయిని నగరంలో తమకు పరిచయమున్న వారికి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులపై నిఘాపెట్టారు. కాగా శనివారం గులాం రసూల్ ఒడిషా నుంచి నగరానికి కారులో గంజాయి రవాణా చేసి, చాపల్రోడ్లోని మహమూద్ఖాన్, చా ంద్బాయ్, బిస్మిల్లాఖాన్, ఎస్కె.ముజాహిద్, తాజుద్దీన్ఖాన్లకు అప్పగిస్తుండగా అప్పటికే కాపు కాసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులపై దాడి చేసి, పట్టుకున్నారు. ఈ దాడిలో ఒడిషాకు చెందిన గంజాయి సప్లయర్ గులాంతోపాటు మొత్తం ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.16లక్షల విలువ చేసే 16.230 కిలోల గంజాయి, రూ. 14,500 నగదుతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.