సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఈ నెల 3, 4 తేదీలలో రెండు రోజుల పాటు ఓటరు నమోదు, జాబితా పరిశీలన కోసం స్పెషల్ క్యాంపెయిన్ ఉన్న నేపథ్యంలో బీఎల్ఓలు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండాలి. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశలో జరిగే ఈ ప్రత్యేక క్యాంపెయిన్లో జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారు తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.