సిటీబ్యూరో, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ) : భిక్షాటనతో చిన్నారుల జీవితాలను నాశనం చేయవద్దని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. నగరంలోని ప్యారడైజ్, ప్యాట్నీ, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, అఫ్జల్గంజ్, ఐఎస్ సదన్, మలక్పేట్, చాంద్రాయణ గుట్ట, పెద్దమ్మ దేవాలయం తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, వారి తల్లులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించారు.
కాచిగూడ నింబోలిగడ్డలోని జువైనల్ బాలికల హోం నుంచి వారి ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కలెక్టర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. 19 మంది చిన్నారులు, ఆరుగురు తల్లులను వారి గ్రామాలకు తరలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి అక్వేశ్వరరావు, బాలికల హోం సూపరింటెండెంట్ కృష్ణవేణి, బాలరక్ష భవన్ అధికారి సుమలత, తదితరులు పాల్గొన్నారు