మహేశ్వరం జోన్బృందం, ఆగస్టు 12: మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా కాలనీల్లో ఉదయం నుంచే కోలాహలం నెలకొన్నది.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, కమిషనర్ సీహెచ్ నాగేశ్వర్కు రాఖీ కట్టి రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
నాదర్గుల్లోని హరి చంద్ర ఫౌండేషన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి ఆధ్వర్యంలో అనాథలకు రాఖీ కట్టి, దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పెద్ద బావి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ శ్రీనివాస్ రాజ్, సాయి, పెద్ద బావి నాగ నందీశ్వర్రెడ్డి, ప్రదీప్ తదితరులు ఉన్నారు.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గూడ రాజీవ్ గృహల్పలో వజ్రోత్సవాలు కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాలతో ప్రదర్శన చేశారు.
గంగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ సాలీవీరానాయక్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు.
కల్వకోల్ గ్రామంలో మహిళలు డాక్టర్ బీంరావు అంబేద్కర్కు రాఖీలు కట్టి అంబేడ్కర్ పట్ల అభిమానాన్ని చాటుకున్నారు. డీఎస్పీ మండల అధ్యక్షుడు జంగయ్య మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ ఏనుగు జంగారెడ్డికి అక్కా చెళ్లెల్లు రాఖీలు కట్టారు.
టీఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ శునకానికి రాఖీ కట్టారు.
మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలుక నర్సింహారెడ్డికి పలువురు మహిళలు రాఖీలు కటారు.