జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఆగస్టు12 : పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలతో ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. శుక్రవారం బోరబండ డివిజన్ బాబాసైలానీనగర్ నుంచి వివిధ వర్గాలకు చెందిన 200 మంది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు కల్పించేందుదకు అనేక చర్యలు చేపడుతోందని.. బోరబండ, రహ్మత్నగర్ డివిజన్లలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.11 కోట్లతో భారీ రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పేదలకు ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, దళితబంధు..
ఇలా అనేక సంక్షేమ పథకాలతో పేదలకు ప్రభుత్వంగా ఆదరణ పొందడంతో అనేక వర్గాల ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పట్ల ఆకర్శితులవుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తన్నూఖాన్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్కుమార్, డివిజన్ కో ఆర్డినేటర్ విజయ్ సింహ, డివిజన్ ఇన్చార్జి సిరాజ్, పార్టీలో చేరినవారు అక్రం, నిజాం, ఇస్మాయిల్, గులాబీష, అస్లాం తదితరులు పాల్గొన్నారు.