హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. దుబాయ్ వెళ్లే విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్యాసెంజర్ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు.. అతడి దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. రూ.19,29,250 విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ప్యాసెంజర్ నుంచి రూ.38,58,500 విలువైన విదేశీ కరెన్సీని అధికారులు సీజ్ చేశారు. ఆ ప్యాసెంజర్ కూడా దుబాయ్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్కు వచ్చాడు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.