హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. దుబాయ్ విమానంలో వచ్చిన ఓ వ్యక్తి తన లోదుస్తుల్లో పేస్ట్గా మార్చిన బంగారాన్ని పెట్టుకొని ఎయిర్పోర్ట్లో దిగాడు. తనిఖీల్లో భాగంగా అధికారులు అతడిని చెక్ చేయగా.. లోదుస్తుల్లో సపరేట్గా ఏర్పాటు చేసిన సీక్రెట్ జేబులో బంగారాన్ని తరలిస్తున్నట్టు గుర్తించారు. అతడి నుంచి రూ.21.70 లక్షల విలువైన 442.6 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకొని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.