సుల్తాన్బజార్, జనవరి 11 : నుమాయిష్కు ఎంతో చరిత్ర ఉందని, దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన వారు స్థానికంగా తయారు చేసే ఉత్పత్తులను ఇక్కడ విక్రయించడం అభినందనీయమని నగర సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నాంపల్లిలోని అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ పోలీస్, భరోసా సెంటర్, షీ టీమ్స్ స్టాల్స్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్లలో ఏర్పాటు చేసిన చిత్రాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న నాటి నుంచే నుమాయిష్తో తనకెంతో అనుభంధం ఉన్నదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నుమాయిష్లో ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించేందుకు ఇంత పెద్ద స్టాల్ను కేటాయించిన ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులకు సీపీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అవగాహన స్టాల్స్తో ఎంతో మందికి ఉపయోగకరంగా ఉందని పేర్కొన్నారు. పోలీస్ స్టాల్స్ను నుమాయిష్కు వచ్చే సందర్శకులు తప్పకుండా సందర్శించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్బాబు, అడిషనల్ సీపీ, లా అండ్ ఆర్డర్ విక్రమ్, జాయింట్ సీపీ ఏసీబీ విశ్వ ప్రసాద్, సిట్, క్రైం అడిషనల్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.