హైదరాబాద్ : ఈ నెల 10వ తేదీన బక్రీద్ పండుగను ముస్లింలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు, ముస్లిం మత పెద్దలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. రహదారులపై వ్యర్థ పదార్థాలు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు చూడాలని సీవీ ఆనంద్ సూచించారు. 300 పారిశుద్ధ్య వాహనాలకు అదనంగా 55 వాహనాలను కేటాయించాలని ఆదేశించారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని సీపీ సూచించారు.