హైదరాబాద్ : ఈ నెల 25న ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్కు సంబంధించిన టికెట్లను సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్లో శుక్రవారం విక్రయించారు. టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో అక్కడ పోలీసులను మోహరించారు. అయితే టికెట్లను కొనుగోలు చేసే క్రమంలో తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో హౌస్ కీపింగ్ సిబ్బంది రంజిత చిక్కుకొని, తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్ నవీన, రంజితను చూసి అప్రమత్తమయ్యారు. వెంటనే బాధితురాలికి సీపీఆర్(కార్డియో పల్మనరీ రిససిటేషన్) చేసి ప్రాణాలు కాపాడింది నవీన. కానిస్టేబుల్ సీపీఆర్ చేసిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రంజిత ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ నవీనను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించి, ప్రశంసల వర్షం కురిపించారు. నవీన బేగంపేట్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తోంది. కానిస్టేబుల్కు ప్రశంసా పత్రంతో పాటు రూ. 5 వేల రివార్డును సీపీ అందించారు.