కొండాపూర్, మే 7: కరోనా మహమ్మారి రోజు రోజుకూ పెరుగుతున్న తరుణంలో మే 10వ తేదీ నుంచి జూన్ 8వ తేదీ వరకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించినట్లు వర్సిటీ వీసీ అప్పారావు శుక్రవారం తెలిపారు. కాగా, వర్సిటీ వీసీ ఆధ్వర్యంలో అన్ని విభాగాల డీన్స్తో సమావేశాన్ని నిర్వహించిన అనంతరం, ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు యాజమాన్యం పేర్కొంది. విద్యార్థుల క్షేమం, ఆరోగ్యం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వీసీ తెలిపారు. నాన్ టీచింగ్ సిబ్బంది సైతం గత కొద్ది రోజులుగా నిరంతరాయంగా విధులు నిర్వహిస్తున్నారని, వారికి విశ్రాంతిని ఇచ్చే క్రమంలో, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం కొవిడ్ బారిన పడుతున్నారని తెలిపారు. జూన్ 9వ తేదీ నుంచి తరగతులను ప్రారంభి జూలై 20వ తేదీ వరకు కొనసాగిస్తామన్నారు. అనంతరం, జూలై 21 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు.