థామస్కుక్ ఇండియాకు హైదరాబాద్
వినియోగదారుల కమిషన్-1 ఆదేశం
సిటీబ్యూరో, మే 24 (నమస్తే తెలంగాణ): ప్రయాణ చార్జీలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మాదాపూర్కు చెందిన మంజు గోయల్, ఏకే గోయల్ దంపతులు. ఏడురోజుల సింగపూర్ టూర్ వెళ్లేందుకు థామస్కుక్ (ఇండియా) ద్వారా 2019 డిసెంబర్లో టికెట్లు బుక్ చేసుకున్నారు.
అయితే, 2020 మార్చిలో చైనా నుంచి కరోనా విజృంభించి సింగపూర్ను తాకింది. దీంతో టూర్ను వాయిదా వేసినట్లు సంస్థ మేనేజర్ ప్రకటించారు. చెల్లించిన ప్రయాణ చార్జీలు తిరిగి ఇవ్వాలని అడగగా.. కంపెనీ ఒప్పుకోకపోవడంతో బాధితులు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన బెంచ్ ఒకరి ప్రయాణ చార్జీ 21,500 కాగా, ఇద్దరికి రూ.43,000 వేలు.. 9 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. నష్టపరిహారం కింద రూ.10 వేలు, ఖర్చుల కింద మరో రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించింది.