హైదరాబాద్ : భార్య మృతికి కారణమైనర భర్తను పోలీసులు రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే..మియాపూర్ మయూరి నగర్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో భూపేంద్రసాహు, ఈషా సాహు(37) దంపతులు నివసిస్తున్నారు. కాగా, ఈషా సాహు రెండో కూతురు పుట్టిందని భర్త భూపేంద్ర సాహు వేధించడంతో మనస్థాపం చెందిన ఈషా తన ఆరు నెలల పాపతో కలిసి ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
తల్లి మృతి చెందగా గాయపడిన పాప దవాఖానలో చికిత్స పొందుతున్నది. తమ బిడ్డ మృతికి భూపేంద్రనే కారణమని ఈషా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈషా భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.