కవాడిగూడ : భార్య కాపురానికి రావడం లేదని తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు తెలిపిన వివరాల ప్రకారం కవాడిగూడ డివిజన్ బీమా మైదాన్కు చెందిన సాయికుమార్(28) అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు.
ఇతనికి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. సాయికుమార్ తరచూ మద్యం సేవిస్తుండటంతో విసుగు చెందిన భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన సాయికుమార్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మోహన్రావు తెలిపారు.