మారేడ్పల్లి, ఆగస్టు 30 : మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వేంకటేశ్వర పెరుమాళ్ స్వామి ఆలయంలో సోమవారం హుండీ లెక్కింపు జరిగింది. ఆలయ చైర్మన్ వై. నర్సారెడ్డి, ఇన్స్పెక్టర్ రవికుమార్, ఈఓ శ్రీనివాస శర్మల సమక్షంలో 5 నెలల హుండీని లెక్కించారు. ఐదు నెలల హుండీ ద్వారా 5 లక్షల 56 వేల 652 రూపాయాల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ నర్సారెడ్డి వెల్లడించారు.
ఐదు నెలల కాలంలో మూడు నెలల పాటు కరోనా కారణంగా భక్తులు అంతంత మాత్రంగా ఆలయానికి భక్తులు వచ్చారని, రెండు నెలల నుంచి భక్తులు ఆలయానికి రావడంతో హుండీ ఆదాయం పెరిగిందన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు ఉంటాయని చైర్మన్ పెర్కోన్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు రాయి వెంకటేష్, నరేందర్రెడ్డి, శారద, సత్యనారాయణ, కెఎం. గోవిందం తదితరులు పాల్గొన్నారు.