సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తరఫున జరిగే అభివృద్ధి పనులు చూడటానికి ప్రభుత్వ శాఖలు, ప్రత్యేకంగా అధికారులు ఉన్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే, ప్రభుత్వాధికారులకు వినతి పత్రం ఇవ్వాలి. అంతే తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పనులు చేయవద్దని తెల్లాపూర్లోని సంక్షేమ సంఘాల నాయకులకు కొల్లూరు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సూచించారు. తెల్లాపూర్ పరిధిలోని పలు కాలనీల్లో ఉమ్మడి అసోసియేషన్ పేరుతో ఒత్తిళ్లు చేస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని, అలాగే అభివృద్ధి పేరిట స్థానికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న అంశం పోలీసుల దృష్టికి రావడంతో వారు అసోసియేషన్కు చెందిన నాయకులకు స్పష్టంగా సూచనలు చేశారు.
హైదరాబాద్ పడమర దిక్కున ఉన్న ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తోంది. ఇలా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో తెల్లాపూర్, కొల్లూర్ ప్రాంతాలు చాలా కీలకంగా మారాయి. ఇతర రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారు తెల్లాపూర్లో నివాసాలు కొనుగోలు చేసి అక్కడే స్థిరపడిపోతున్నారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కావడంతో అక్కడ అభివృద్ధి పేరుతో వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానికంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి మాయమాటలు చెప్పి గందరగోళానికి గురి చేస్తున్నారు. స్థానికంగా ఏ సమస్య ఉన్నా అసోసియేషన్ చూసుకుంటుందని, లేని హడావిడి చేసి తెల్లాపూర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏదైనా అభివృద్ధి జరిగే తమ వల్లే జరిగిందంటూ బూటకపు ప్రచారాన్ని చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా తెల్లాపూర్ ప్రాంతానికి మున్సిపల్ హోదా రావడంతో తెలంగాణ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తూ మున్సిపల్ అధికారులు, ఇతర శాఖ అధికారులతో కలిసి సమన్వయంతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే స్థానికంగా ఉన్న తెల్లాపూర్ సంక్షేమ సంఘం పేరుతో కొందరు చేస్తున్న బూటకపు చర్యలు స్థానికులకు తీవ్రం ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా కొందరు నాయకులు అసోసియేషన్ల పేరుతో అభివృద్ధి పేరిట స్థానిక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా కాలనీల్లో నివాసం ఉంటున్న వారిని సభ్యులుగా చేరుస్తూ, ఆ కాలనీని గ్రూపులుగా విభజించి కాలనీ వాసుల
ఇటీవల మద్యం టెండర్ ప్రక్రియలో వైన్ షాప్ మంజూరైతే దాని నిర్వాహకుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం వైన్ షాపు పెట్టేందుకు సిద్ధం కాగా , ఆ ప్రాంతంలో వైన్షాప్ పెట్టకూడదంటూ కాలనీల పేరుతో సంతకాల సేకరణ చేశారు. ఈ విషయం మద్యం వ్యాపారికి తెలిసి, అసోసియేషన్ సభ్యులను సంప్రదిస్తే బేరసారాలు మొదలు పెట్టారు. ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు తెల్లాపూర్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇవే కాకుండా తాజాగా ఎన్నికలు సమీపిస్తుండటంతో కొత్తగా నమోదైన ఓటర్లను సైతం కలిసి మీరు ఫలానా పార్టీకి ఓటేస్తే మంచిదంటూ ఓటర్లను కలిసి మభ్యపెడుతున్నారు. మరోవైపు మా అసోసియేషన్తో పేరు చెబితే ఇన్ని ఓట్లు పడతాయంటూ కొన్ని పార్టీలతో ముందే బేరసారాలు కుదుర్చుకుంటున్నారన్న ఆరోపణలు తెల్లాపూర్లోని కాలనీ సంఘాల నాయకులపై ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తెల్లాపూర్లోని కాలనీ సంఘాల నాయకులకు గట్టిగా చెప్పడంతో పాటు ప్రజలను ఇబ్బందులు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.