సికింద్రాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో హౌసింగ్ స్కీం కు(Housing issues) సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించాలని శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ (MLA Padmarao Goud) అధికారులను ఆదేశించారు. హౌసింగ్ స్కీం ల పై శనివారం సీతాఫల్మండిలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
లాలాపేటలోని చంద్రబాబు నగర్లో గతంలో నిర్మించిన ఇళ్లు శిథిలావస్థకు చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అపాయకరంగా ఉన్న ప్రాంగణాల్లో ప్రజలు నివసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాయినగర్ లో నిర్మాణం పనుల్లో జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా మరాఠా బస్తీ లో కొత్త ఇండ్లను నిర్మించాలని, దోభీఘాట్, సుభాష్ చంద్రబోస్ నగర్, ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లలో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించాలని సూచించారు.
హమాలీబస్తీ లో వివాదాలు పరిష్కరించాలని, శాస్త్రి నగర్, తదితర బస్తీల్లో శిథిలావస్థలో ఉన్న భవనాల పునర్నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ హౌసింగ్ సెల్ ఏఈ క్రాంతి, అధికారులు మల్లికార్జున్, సికింద్రాబాద్ కార్పొరేటర్లు హేమ, ప్రసన్న లక్ష్మి , శైలజ, సునీత తదితరులు పాల్గొన్నారు.